ఉమ్మనీరు తాగి పసికందు మృతి

by  |
ఉమ్మనీరు తాగి పసికందు మృతి
X

దిశ, నల్లగొండ: ఉమ్మనీరు తాగి ఓ పసికందు నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. హన్మకొండకు చెందిన మీనా కౌర్ నిండు గర్భిణి. నెలలు నిండినా రోనా నేపథ్యంలో కాన్పు చేయడానికి స్థానికంగా ఉన్న ఆస్పత్రులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఉన్న తమ బంధువుల వద్దకు వచ్చారు. ఈ నెల 10వ తేదీన మీనా కౌర్‌కు నొప్పులు రావడంతో మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా వారు డెలివరీ చేశారు. ఆమె మగశిశువుకు జన్మనిచ్చి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. మరుసటిరోజు11వ తేదీన శిశువు కూడా అనారోగ్యంగా ఉండటంతో మిర్యాలగూడలోనే ఓ చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకువెళ్లగా, అక్కడి వైద్యులు పరిశీలించి నల్లగొండకు తీసుకుపోవాల్సిందిగా సూచించారు. వెంటనే ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పసికందుకు చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు. ఉమ్మనీరు తాగడంతోనే పసికందు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. శిశువు పుట్టిన మరుసటి రోజే మృతి చెందడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story

Most Viewed