HYD: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్

by  |
18 plus vaccine in Hyderabad
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం 100 వ్యాక్సిన్ కేంద్రాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే తొలుత వ్యాక్సిన్ అందించనున్నారు.

కొవిన్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకుని సమీప వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మహానగరంలో 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నారు. అలాగే సూపర్‌స్పైడర్స్‌కు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు.


Next Story

Most Viewed