హెచ్ ఆర్సీని ఆశ్రయించిన వలస కూలీలు

by Sridhar Babu |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: తమ ఆకలిని తీర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది వలస కూలీలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కోరారు. ఏపీకి చెందిన ఈ కూలీలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్‌లో ఉంటూ పనులు చేస్తున్నారు. మంగళవారం అక్కడి నుంచి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫోన్ ద్వారా తమ విన్నపాన్ని తెలియ జేశారు. వెంటనే స్పందించిన హెచ్ ఆర్సీ కూలీలకు తక్షణమే సాయం అందించాలని కరీంనగర్ ఆర్డీఓ, ఎమ్మార్వో లకు ఫోన్‌లోనే [&hellip;]</p>

హెచ్ ఆర్సీని ఆశ్రయించిన వలస కూలీలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తమ ఆకలిని తీర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది వలస కూలీలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కోరారు. ఏపీకి చెందిన ఈ కూలీలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్‌లో ఉంటూ పనులు చేస్తున్నారు. మంగళవారం అక్కడి నుంచి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫోన్ ద్వారా తమ విన్నపాన్ని తెలియ జేశారు. వెంటనే స్పందించిన హెచ్ ఆర్సీ కూలీలకు తక్షణమే సాయం అందించాలని కరీంనగర్ ఆర్డీఓ, ఎమ్మార్వో లకు ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేశారు.

Tags: HRC, immigrant laborers, Hyderabad, phone, Karimnagar, RDO, MRO

Next Story