బ్రేకింగ్: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి భట్టి

by  |
MLA podem veeraiah
X

దిశ, భద్రాచలం అర్బన్: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌తో అనారోగ్యానికి గురైన ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించి అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కొంత నిలకడగానే ఉందని ఎమ్మెల్యే పీఏ ఆదిత్య తెలిపారు. పొదెం వీరయ్య అనారోగ్యం గురించి తెలియగానే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. పొదెం ఆరోగ్యంపై ఎవరూ అధైర్య పడొద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని భట్టి ధైర్యం చెప్పారు. అనంతరం వీరయ్య ఆరోగ్యం గురించి అపోలో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పొదెం వీరయ్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, ఆదివాసీ సంఘాల వారు కోరుతున్నారు.



Next Story

Most Viewed