- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపబ్యూరో : పశ్చిమగోదావరి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని జీలుగుమిల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద గత అర్ధరాత్రి ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 4,275 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని వారు అంచనా వేశారు. జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఈ అక్రమ మద్యం మాఫియా కార్యకలాపాలు సాగుతన్నట్లు పట్టుబడిన వారి ద్వారా గుర్తించామన్నారు. అధికార పార్టీకి చెందిన నేత కనుసన్నల్లోనే ఈ అక్రమ మద్యం దందా నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story