- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భువనగిరి రూరల్ : జనావాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న వ్యాపారిని పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆకస్మికంగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వొలిగొండ మండల కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది.
వివరాల్లోకివెళితే.. వొలిగొండకు చెందిన బెలిద కుశ కుమార్ గత కొంతకాలంగా జనావాసాల మధ్య వివిధ కంపెనీలకు చెందిన గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చి 5 కేజీల సిలిండర్లలో ఫిల్లింగ్ చేస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడు. అది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనావాసాల మధ్య ఫిల్లింగ్ ఆపి వేయాలని కోరినా అతను పట్టించుకోలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో వ్యాపారి కుశకుమార్ ఇంటిపై దాడి చేసి 4 పెద్ద గ్యాస్ సిలిండర్లు, 14 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్యాస్ ఫిల్లింగ్ చేసే యంత్రాలను సీజ్ చేయడమే కాకుండా, కుశ కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.