ఉదయం ఆరుకే మొదలు.. అర్థరాత్రికే ఆగుడు

by  |
exi
X

దిశ,మహేశ్వరం: మండలంలోని తుమ్మలూరు, మొహబ్బత్ నగర్, అమీర్‌పేట్, ఆకాన్‌పల్లి, పొరండ్ల, కోళ్ల పడకల్, మాణిక్యమ్మగూడ, చిన్నతూప్ర గ్రామాలతో పాటు, పలు గ్రామాలలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి గ్రామాలలో పలు కిరాణా దుకాణాల్లో, హోటలల్లో మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వీరంతా ఎలాంటి అనుమతి లేకుండా మద్యాన్ని అమ్ముతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఒక్క క్వాటర్ బాటిల్ (సీసా) కు 20 – 30 రూపాయలు, బీరు సీసాకు 20 -30 వరకు అదనంగా తీసుకొని అమ్ముతున్నారు. విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్న కిరాణా దుకాణల వైపు, హోటల్ల వైపు ఎక్సైజ్‌శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం ఆరుగంటలకే మద్యం అమ్మకం మొదలు పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలల్లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న దుకాణలపై చర్యలు తీసుకోవాలంటున్నారు.


Next Story

Most Viewed