- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రికి రాత్రే సర్దుకున్నరు
by Shyam |
<p> నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారు రాత్రికి రాత్రే సర్దుకున్నారు. చిట్యాల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఓ ప్రజా ప్రతినిధి అక్రమంగా మద్యం అమ్ముతూ బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడన్న ప్రచారంతో మీడియా అక్కడికి వెళ్లగా విషయం తెలుసుకొని రాత్రికి రాత్రే ఆ ప్రజా ప్రతినిధి బెల్ట్ షాపును ఖాళీ చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చేరుకున్న పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ […]</p>

X
నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారు రాత్రికి రాత్రే సర్దుకున్నారు. చిట్యాల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఓ ప్రజా ప్రతినిధి అక్రమంగా మద్యం అమ్ముతూ బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడన్న ప్రచారంతో మీడియా అక్కడికి వెళ్లగా విషయం తెలుసుకొని రాత్రికి రాత్రే ఆ ప్రజా ప్రతినిధి బెల్ట్ షాపును ఖాళీ చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చేరుకున్న పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ తుకారాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సందర్శించి, మద్యాన్ని విక్రయించిన వారిని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరాృతం అయితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇంత జరిగినా ఎక్సైజ్ అధికారులు ఇప్పటివరకు గ్రామానికి రాకపోవడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడం వల్లే అందరూ వెనుకడుగు వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Next Story






