‘కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే నాలుక కోస్తాం’

by  |
Puranam Satheesh Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కుటుంబం కీలక భూమిక పోషించిందని, ఎవరైనా కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే నాలుక కోస్తామని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ హెచ్చరించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్యాగాలు చేసిన కుటుంబంపై ఎవరైనా అవాక్కులు… చెవాక్కులు చేస్తే నాలుక కోసి చీరుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న నేతలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కమీషన్ల కోసం టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి మధుయాష్కీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శలు చేశారు.


Next Story

Most Viewed