- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు నిర్వహించిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో మరణించిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేయడం సంచలనం రేపింది. జగిత్యాల రూరల్ మండలం టీఆర్ నగర్ కు చెందిన ఒర్సు రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. మంత్రాల నెపంతో రమేష్ మృతి చెందాడని, తానే మంత్రాలతో రమేష్ ని చంపానని, మళ్ళీ బ్రతికిస్తానంటూ ఉదయం నుండి శవం దగ్గర పుల్లయ్య అనే వ్యక్తి పూజలు చేయడం మొదలుపెట్టాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పుల్లయ్య ను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
కాళ్లు చేతులు ఆడించాడట…
రమేష్ శవం వద్ద పుల్లయ్య పూజలు చేయడంతో కాళ్లు చేతులు ఆడించాడని స్థానికులు చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తున్న క్రమంలో పోలీసులు వచ్చి శవాన్ని తీసుకెళ్లారంటూ వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు రాకుంటే రమేష్ జీవించేవాడని వాపోతున్నారు.