న్యాయం జరగకుంటే 'చలో నారాయణఖేడ్' : టీయూడబ్ల్యూజే

by  |
న్యాయం జరగకుంటే చలో నారాయణఖేడ్ : టీయూడబ్ల్యూజే
X

దిశ, మెదక్: నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి దౌర్జన్యంగా వీ6 రిపోర్టర్ పరమేశ్వర్ ఇంటి కట్టడాన్ని కూల్చేసిన సంఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితుడికి న్యాయం చేకూర్చాలని, లేనిపక్షంలో ‘చలో నారాయణఖేడ్’ కార్యక్రమాన్ని చేపట్టి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా శాఖ కార్యదర్శి విష్ణు కుమార్ అన్నారు. ఎమ్యెల్యే దౌర్జన్యాన్ని నిరసిస్తూ శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి కలెక్టర్ హన్మంతరావుకు వినతి పత్రాన్ని అందించారు. నారాయణ్ ఖేడ్ పట్టణంలో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి కనుసైగలతో ఎన్నో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, దీనిని పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఎమ్యెల్యే ఆదేశాలతో ఓ పేద విలేఖరి ఇంటి కట్టడాన్ని కూల్చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలను కాలరాసి అట్టహాసంగా వెయ్యి మందితో జన్మదిన వేడుకలు జరుపుకున్న సంఘటనపై ఎమ్యెల్యే భూపాల్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి రూ .10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే వీడియో జర్నలిస్టులు, పలువురు సీనియర్ జర్నలిస్టులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed