- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే స్పాట్లోనే ఫైన్ విధించడానికి కేంద్రం సిద్ధమైంది. కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్టులో నిబంధనలను డీజీసీఏ కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుంటే విమానంలో నుంచైనా సదరు ప్రయాణికుడిని దింపేయాలని ఇప్పటికే తెలిపింది. తాజాగా, మరో అడ్వైజరీని విడుదల చేసింది. కొన్ని విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఒకవేళ ప్రయాణికులు నిబంధనలు పాటించకుంటే చట్టానికి లోబడి స్పాట్లోనే జరిమానా వసూలు చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది.
Next Story