చనిపోయే ముందు ధోని కొట్టిన సిక్స్ చూస్తా

by  |
చనిపోయే ముందు ధోని కొట్టిన సిక్స్ చూస్తా
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడంతో అభిమానులే కాకుండా క్రికెటర్లు కూడా నివ్వెరపోయారు. ధోని రిటైర్మెంట్‌తో దిగ్గజ క్రికెటర్ సునిల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ధోనీతో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ధోనీ ఒక మంచి బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. అతను కెప్టెన్‌గా భారత జట్టుకు ఎంతో సేవ చేశాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన సిక్సర్ ఎవరూ మర్చిపోలేరు.

గతంలో ఐపీఎల్ జరగుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా ధోనీని కలిశాను. అప్పుడు అతనితో తాను చనిపోయే ముందు నువ్వు 2011 ఫైనల్స్‌లో కొట్టిన సిక్స్ చూసి సంతోషంగా చనిపోతా అని చెప్పాను. అప్పుడు మహీ ఏమీ మాట్లాడలేదు.. ఒక సారి నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో కపిల్ కంటే మహీనే గొప్ప కెప్టెన్ అని చెబుతాను. ఇద్దరూ ఆల్ టైం నంబర్ వన్ కెప్టెన్లే. అయితే మహీ వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా సాధించాడు. అందుకే అతడే గొప్ప అని గవాస్కర్ అన్నాడు.

Next Story

Most Viewed