- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడాలంటే ఇకపై వయసు నిబంధన కచ్చితంగా పాటించాలని ఐసీసీ ప్రకటించింది. ఏ క్రికెటర్కి అయినా 15 ఏళ్లు నిండితేనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఐసీసీ అనుమతి ఇవ్వనుంది. 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న క్రికెటర్తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడించాలంటే సదరు దేశం తప్పని సరిగా ఐసీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ క్రికెటర్ను ఐసీసీ పరీక్షించి.. అతడికి సరైన ఫిట్నెస్, మానసికస్థైర్యం ఉన్నట్లు భావిస్తేనే ఐసీసీ అతడికి అనుమతించనున్నది. ఈ నిబంధన అన్ని ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్లు, అండర్ 19 క్రికెట్కు వర్తించనున్నది. మహిళ, పురుష క్రికెటర్లకు ఈ నిబంధన అమలు చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రజా 14 ఏల్ల 227 రోజులకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సచిన్ మాత్రం 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.