ఆయన ఆశయాలను నెరవేరుస్తాను..

by  |
ఆయన ఆశయాలను నెరవేరుస్తాను..
X

దిశ, దుబ్బాక: దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి ఏవిధంగా అభివృద్ధి చేశాడో తాను కూడా అదేవిధంగా పనిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాత అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆకారం, బొప్పాపూర్, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, చౌదర్ పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మా రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామలింగారెడ్డి మన మధ్యలో లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని బోరున విలపించారు. రామలింగారెడ్డిని అభిమానించినట్టు నన్ను కూడా మీ మనసులో పెట్టుకోవాలనీ ఆమె అన్నారు. తాను గెలిచిన తరువాత రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చుతానని అన్నారు.



Next Story

Most Viewed