- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మిడ్-రేంజ్ కార్లలో అత్యంత ఆదరణ కలిగిన హ్యూండాయ్ మోటార్స్ సరికొత్త ఐ20 భారత మార్కెట్లో విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్షోరూమ్ ధరను రూ. 6,79,900గా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలోనే ఈ సరికొత్త హ్యాచ్బ్యాక్ను తీసుకురావాలని భావించప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఈ కొత్త i20 దేశీయంగా మారుతీ సుజుకి బలెనో, టాటా ఆల్ట్రోజ్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
వారం క్రితం కంపెనీ బుకింగ్లను ప్రారంభించింది. రూ. 21 వేలకే కొత్త ఐ20ని బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎల్ఈడీ హెడ్లైట్స్, 20.63 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్, ఆకర్షణీయమైన సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి ఫీచర్లు వాహనదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ వివరించింది. ఐదేళ్ల వారెంటీ, మూడేళ్ల బ్లూలింగ్ సబ్స్క్రిప్షన్ అందిస్తున్నట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. సరికొత్త హ్యూండాయ్ ఐ20 పలు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.