- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ నుంచి వచ్చిన సరికొత్త హ్యూండాయ్ ఐ20-2021 మోడల్ ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు కోసం తొమ్మిది కార్లు పోటీపడగా థర్డ్ జెనరేషన్ హ్యాచ్బ్యాక్గా ఐ20 మోడల్ దీన్ని సాధించుకుంది. గతేడాది చివర్లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు హ్యాచ్బ్యాక్ విభాగంలో మహీంద్రా థార్, కియా సొనెట్ లాంటి కార్లను సైతం అధిగమించింది.
ఇక, ప్రీమియం కార్ల విభాగంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రీమియర్ కార్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఈ జాబితాలో మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ రెండో స్థానంలోనూ, బీఎండబ్ల్యూ 2 సిరీస్ మూడో స్థానంలో ఉంది. ఇక, ఎలక్ట్రికల్ విభాగంలో టాటా నెక్సాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, తర్వాతి స్థానాల్లో హ్యూండాయ్ కొనా, ఎంజీ జెడ్ఎస్ నిలిచాయి. టాటా నెక్సాల్ కారు గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.