- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్ బ్యూరో: రాజధాని నగరంలో సంచలనం రేపిన డబల్ మర్డర్ ను 24 గంటలు గడవక ముందే ఛేదించారు. లంగర్ హౌస్ ప్రాంతంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10.30 సమయంలో ఆలివ్ హాస్పిటల్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో చాంద్ మహమ్మద్ అనే రౌడీ షీటర్ ను అశ్వక్ గ్యాంగ్ ప్రాణం పోయే వరకూ కత్తులతో పొడిచిన సంఘటన సంచలనమైంది. ఈ సమయంలో చాంద్ అనుచరుడు అబూ కూడా మరణించాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 8.30 గంటలకు గోల్కొండ పీఎస్ పరిధిలో పాత కక్షల కారణంగా మల్లేపల్లి విజయ్ నగర్ కాలనీకి చెందిన రాహుల్ ను స్నేహితుడే హత్య చేశాడు. ఆస్తి వివాదాలతో మాట్లాడుకుందాం రమ్మని పిలిచి ఓ యువకుణ్ణి కత్తితో పొడిచిన ఘటన రెయిన్ బజార్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇలా ఒకే రోజే సిటీలో నాలుగు హత్యలు కలకలం రేపాయి. అయితే, వీటిని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ను ముమ్మరం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగిన హత్యలకు సంబంధించి నిందితులను గుర్తించగా.. రాత్రి జరిగిన డబుల్ మర్డర్ కు సంబంధించి తెల్లవారేసరికి ఐదుగురిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.