కర్ఫ్యూ ఎఫెక్ట్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్

by  |
Hyderabad Metro Rail
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ తమ సర్వీసుల సమయాన్ని తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నేటి నుంచి చివరి ట్రైన్ సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు ప్రారంభమై 8 గంటల 45 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఉదయం యధావిధిగా ఆరున్నర గంటలకు ట్రైన్స్ ప్రారంభం అవుతాయి. మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల అందరూ కోవిడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని హైదరాబాద్ మెట్రో అధికారులు సూచించారు.


Next Story

Most Viewed