ప్రయాణికులకు శుభవార్త….

by  |
ప్రయాణికులకు శుభవార్త….
X

దిశ, వెబ్ డెస్క్:
ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో రాయితీలను ప్రకటించింది. సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40శాతం రాయితీని మెట్రో ఇవ్వనుంది. ఈ మేరకు స్మార్ట్ కార్దు ద్వారా 14 ట్రిప్పులకు చెల్లించే ఛార్జీలతో 20 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని కల్పించింది.

ఇంకా20 ట్రిప్పుల ఛార్జీలతో 30, 40ట్రిప్పుల ఛార్జీలతో 60 ట్రిప్పులను తిరిగే అవకాశం కల్పించింది. టీ- సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి మరి కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తేనున్నట్టు మెట్రో తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని మెట్రో చెప్పింది.


Next Story

Most Viewed