పాతబస్తీలో పర్యటించిన సీపీ

by  |
పాతబస్తీలో పర్యటించిన సీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వరదలు చేరి, ఇల్లు మునిగిపోయాయి. దీంతో ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాల వల్ల ఇప్పటికే పాతబస్తీ పోలీసులను అలర్ట్ చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో వరద బాధితులను రెస్క్యూ చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని అంజనీకుమార్ హెచ్చరించారు.



Next Story