- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజూర్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరాడు. శుక్రవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు సాయిరాం గౌడ్కు గులాబీ కండూవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్లు ఉన్నారు. కాగా, ఇటీవలే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.