నా సత్తా ఏంటో చూపిస్తా.. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ సంచలన వ్యాఖ్యలు

by  |
NSUI, NSUI state president, Balmuri Venkat, Huzurabad Congress candidate, huzurabad by elections, revanth reddy
X

దిశ, కరీంనగర్ సిటీ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోన్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల తరువాత నుండి హుజురాబాద్‌లోనే నా మకాం. ఇకనుండి ప్రత్యర్థి పార్టీలు చేసిన తప్పిదాలను ఎత్తిచూపి హుజురాబాద్ ప్రజల మనసు గెలుచుకుంటా. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ చేసిన అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ వచ్చే ఎన్నికల నాటికి తన సత్తా చాటుతా. ప్రలోభాలు, ధన ప్రవాహం మధ్యనే ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే ఇక్కడి విషయాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటం కూడా చేస్తాం. 28 ఏళ్ల యువకున్ని రానున్న కాలంలో ఇక్కడి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతా.’’ అని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అన్నారు.

Next Story

Most Viewed