అర్థరాత్రి ఆ పని చేస్తూ దొరికిన కార్పొరేటర్ల భర్తలు.. షాకైన పోలీసులు

by  |
carporate husbends
X

దిశ కీసర: ఆదివారం తెల్లవారుజామున 1.00 గంటకు మల్కాజ్ గిరి ఎస్‌వోటీ పోలీసులు రస్టిక్ వోగ్ రిసార్ట్స్ పై దాడులు నిర్వహించారు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో చీర్యాలలోని రస్టిక్ వోగ్ రిసార్ట్‌ పై దాడులు నిర్వహించి రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, వారి వద్ద నుంచి రూ. 65,610 నగదు, 5 సెల్ ఫోన్లు,ప్లేయింగ్ కార్డ్ సెట్స్-4 ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు కార్పొరేటర్ల భర్తలు ఉన్నట్టు సమాచారం. పట్టుబడిన వారిలో మారగొని.వెంకటేష్ గౌడ్,మనోదర్ రెడ్డి సంగారెడ్డి, బల్లి శ్రీనివాస్, బుర్క రమేష్, అందే సురేష్, తాడూరి నరేష్, రాహుల్‌లను అరెస్ట్ చేశారు. పట్టు బడిన వారిలో జవహర్ నగర్‌కు చెందిన కార్పొరేటర్ల భర్తలు ఉండడం గమనార్హం.. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కీసర పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed