మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త

by  |
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని సీతయ్యనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కాలనీలో గతకొన్నేండ్లుగా మందుల శివరామరాజు, చిన్నమ్మలు జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో శివరామరాజు మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. తాగుడు విషయంలో రోజూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది.

దీంతో ఏడాది క్రితం భార్యాపిల్లను వదిలేసి వెళ్లిపోయాడు. మంగళవారం రేషన్ సరుకుల కోసం తంబ్ వేయాల్సుండగా, భార్య చిన్నమ్మ ఆయన్ను ఇంటికి పిలిపించింది. దీంతో రామరాజు మళ్లీ తాగొచ్చి, భార్యపై అనుమానంతో హతమార్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed