భార్యను కడతేర్చిన భర్త కారణం అదేనా..?

by  |
murder
X

దిశ, కూకట్​పల్లి: భార్య అందరితో కలుపుగోలుగా ఉండటం నచ్చక, భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, భార్యను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మూసాపేట్​లో చోటు చేసుకుంది. సీఐ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా గజపతి జిల్లా కు చెందిన భాస్కర్​ రావు గత కొన్ని ఏండ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి మూసాపేట్​లో నివాసం ఉంటున్నారు. భాస్కర్​ రావుకు ముగ్గురు ఆడబిడ్డలు అందరికి వివాహం జరిపించాడు. చిన్న కూతురు భవాని అలియాస్​ పుణ్యవతి(20)కి శ్రీకాకుళం జిల్లా హీరమండలం గొట్ట గ్రామానికి చెందిన బబ్బోని సంతోష్​(28)కి ఇచ్చి 2021, మే 30వ తేదిన పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించాడు. మూడు లక్షల కట్నం, మూడు తులాల బంగారం ఇచ్చాడు.

ఇదిలా ఉండగా సంతోష్​ స్థానికంగా వెల్డింగ్​ దుకాణంలో పని చేస్తుంటాడు. భార్య పుణ్యవతి తో కలిసి సంతోష్​ మూసాపేట్ గూడ్స్​షెడ్​ రోడ్డు​లోని తులిప్​ బార్​ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కాగా వివాహం జరిగిన కొన్ని నెలలకే భార్యను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దని, చుట్టుపక్కల వారితో మాట్లాడకుండా అడ్డుకుంటూ వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో నచ్చచెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా గురువారం పుణ్యవతి ఇంటికి తాళం ఉండటంతో, సమీప బంధువు భాస్కర్​ రావు ఇంటికి వెళ్లి పుణ్యవతి అక్కడికి వచ్చిందా అని అడగటంతో.. భాస్కర్​ రావు పుణ్యవతి ఇంటికి వెళ్లి చూశాడు. భాస్కర్​ రావుకు అనుమానం వచ్చి శుక్రవారం 7 గంటల ప్రాంతంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇంట్లో పుణ్యవతి శవమై కనిపించింది. తన కూతురు పుణ్యవతిని గొంతు నులిమి చంపి తన భర్త సంతోష్​ బయటి నుంచి తాళం వేసుకుని పరారైనట్టు కూకట్​పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి భాస్కర్​ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భర్త సంతోష్​ గురించి గాలిస్తున్నారు.


Next Story

Most Viewed