స్వాతి రెడ్డి.. జైలుకు తరలింపు

by  |
స్వాతి రెడ్డి.. జైలుకు తరలింపు
X

ర్త సుధాకర్ రెడ్డి హత్యకేసులో నిందితురాలు స్వాతి రెడ్డిని పోలీసులు మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. బెయిల్‌పై వచ్చి మహబూబ్‌నగర్ స్టేట్ హోంలో ఉన్న స్వాతి రెడ్డి కొంతకాలంగా నాగర్‌కర్నూలు జిల్లా కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. దీంతో న్యాయమూర్తి రవి కుమార్ ఇటీవలే స్వాతికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు స్వాతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. 2017లో ప్రియుడితో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed