- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జుక్కల్: అనుమానంతో భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన ధ్యానబోయిన సవిత(26)కు గత 5 ఏళ క్రితం సాయిలుతో వివాహం జరిగింది. భార్య మీద అనుమానంతో పలుమార్లు గొడవలు కాగా, గ్రామ పెద్దలు పంచాయితీ ఏర్పాటు చేసి నచ్చజెప్పారు. అయిన భర్త సాయిలులో ఎలాంటి మార్పు రాలేదు.
సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ పుట్టింటికి వెళ్ళొస్తా అని చెప్పగా, మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. దీంతో అత్త, మామల సహకారంతో సాయిలు భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి, సీఐ టాటాబాబు పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.