తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదని భార్యను చంపిన భర్త

by  |
తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదని భార్యను చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని సరిగా చూసుకోవడంలేదని భార్య గొంతు నులిమి చంపాడు ఒక భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసిఫాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన రవి తన తల్లి,భార్య సమతలతో కలిసి రాజేంద్ర నగర్ హైదర్ గూడ లో నివాసముంటున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్యకు, తల్లికి మధ్య విబేధాల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తన తల్లిని సరిగ్గా చూసుకోవడంలేదని రవి, భార్య సమత తో నిత్యం గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి మద్యం తాగొచ్చిన రవి భార్యతో గొడవపడి క్షణికావేశంలో సమత గొంతు నులిమి హత్య చేసాడు. స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed