- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లిని సరిగా చూసుకోవడంలేదని భార్య గొంతు నులిమి చంపాడు ఒక భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసిఫాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన రవి తన తల్లి,భార్య సమతలతో కలిసి రాజేంద్ర నగర్ హైదర్ గూడ లో నివాసముంటున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్యకు, తల్లికి మధ్య విబేధాల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తన తల్లిని సరిగ్గా చూసుకోవడంలేదని రవి, భార్య సమత తో నిత్యం గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి మద్యం తాగొచ్చిన రవి భార్యతో గొడవపడి క్షణికావేశంలో సమత గొంతు నులిమి హత్య చేసాడు. స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Next Story