వీడిన మిస్టరీ.. ఆమె కోసం కట్టుకున్న భార్యను చెట్టుకు వేలాడదీశాడు

by  |
వీడిన మిస్టరీ.. ఆమె కోసం కట్టుకున్న భార్యను చెట్టుకు వేలాడదీశాడు
X

దిశ: లింగాల : నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని వడ్డెర రాయవరం గ్రామానికి చెందిన వివాహిత ఈనెల 22న అదృష్టమై హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెద్దమ్మ (40) భర్త చిన్న వెంకటస్వామి అదే గ్రామానికి చెందిన మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనికి తన భార్య అడ్డు వస్తుందని భావించి అతనికి పరిచయం ఉన్నటువంటి రాయవరం గ్రామానికి చెందిన పిట్టల ఆంజనేయులుతో కలిసి ఇద్దరు ఎడ్లబండిపై మృతురాలిని నల్లమల్ల అటవీ ప్రాంతానికి తీసుకొని వెళ్లారు.

మొదటగా పెద్దమ్మ గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఉరి తీసి, మృతురాలు తనంతట తానే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించినట్టు స్థానిక ఎస్సై కృష్ణయ్య తెలిపారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను గురువారం అచ్చంపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టగా, వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మహబూబ్ నగర్ జైలుకు తరలించినట్లు అచ్చంపేట డీఎస్పీ నరసింహులు తెలిపారు.


Next Story

Most Viewed