- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : స్నానం చేసిన తర్వాత టవల్ తీసుకురావడంతో ఆలస్యం చేసిందనే కోపంతో భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. అటవీ శాఖ దినసరి వేతన ఉద్యోగిగా పని చేస్తున్న రాజ్ కుమార్ బహే స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పాబాయిని (45) అడిగాడు.
ఆమె ఇంట్లో పాత్రలు తోముతున్నానని కొంత సేపు ఆగాలని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ గడ్డ పారతో భార్య తలపై పలుమార్లు బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమయంలో తండ్రిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా తనను బెదిరించాడని కూతురు పోలీసులకు వివరించింది. బాధిత కూతురి ఫిర్యాదు మేరకు నిందితుడిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story