భార్య పుట్టింటికి వెళ్లిందని వేరే మహిళతో ప్రేమాయణం.. తీరా చూస్తే!

by  |
భార్య పుట్టింటికి వెళ్లిందని వేరే మహిళతో ప్రేమాయణం.. తీరా చూస్తే!
X

దిశ, పటాన్‌చెరు : జీవితం మీద విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ పి.కిష్టారెడ్డి కథనం ప్రకారం.. డాకూరి శ్రీకాంత్ రెడ్డి, శోభ భార్యభర్తలు. వీరిద్దరూ అమీన్ పూర్‌లోని టైలర్స్ కాలనీలో నివాసముంటున్నారు. అయితే, మృతుని భార్య శోభ చందానగర్‌లోని శ్రీపాద్ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా గతేడాది వరకు పనిచేసింది. ఇటీవల ఆమెకు కొడుకు పుట్టగా ఉద్యోగం మానివేసింది. అయితే, అదే ఆసుపత్రిలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న భర్త శ్రీకాంత్ రెడ్డి (35) తన భార్య పుట్టింటికి వెళ్లడంతో వేరొక మహిళతో చనువుగా ఉంటూ వచ్చాడు.

ఆమెతో కలిసి ఫోటోలు కూడా దిగాడు. విషయం తెలుసుకున్న శోభ తన భర్తను గట్టిగా నిలదీసి అడుగడంతో తాను వేరొక మహిళను ప్రేమిస్తు్న్నానని, ఆమె లేకపోతే తానూ బతకలేనని చెప్పి భార్యను బెదిరించాడు. గురువారం శోభ తన తల్లిగారి ఊరు పిట్లంకు రిజిస్ట్రేషన్ పని గురించి వెళ్ళగా, శ్రీకాంత్ రెడ్డి తాను ఇష్టపడిన మహిళ తనకు దక్కలేదనే కారణంతో జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య డాకూరి శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిష్టారెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed