భార్యకు కరోనా.. భర్త ఆకస్మిక మృతి

by  |
భార్యకు కరోనా.. భర్త ఆకస్మిక మృతి
X

దిశ, వె‌బ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. భార్యకు కరోనా సోకిందనే బెంగతో భర్త మరణించారు.ఈ ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థత పడుతోంది.

దీంతో ఆమెకు టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయం తెలిసుకున్న భర్త (70) మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్థాపంతో చెందిన అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కాగా, వీరికి కొడుకు, కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also..

ఏదీ నిజం.. శ్రావణి కేసులో ఊహించని ట్విస్టులు..

Next Story

Most Viewed