భార్యపై అనుమానం.. భర్త చేసిన పనికి షాక్‌లో పోలీసులు

by  |
tamilnadu suicide
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం రావడంతో భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. అనుమానంతో భార్యను చంపి తాను ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శ్రీహరిపురం గొల్లలపాలెంలో గురువారం ఉదయం జరిగింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవి(38), పోలవరపు శివ నాగేశ్వరరావు(45) దంపతులు స్థానికంగా చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నారు. వారిద్దరి మధ్య కుటుంబ కలహల కారణంగానే శివ నాగేశ్వరరావు భార్య మాధవిని డంబుల్‌తో కొట్టి హతమార్చాడు. అనంతరం భర్త శివ నాగేశ్వరరావు కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed