ప్రకాశంలో దంపతుల ఆత్మహత్య..

by  |
ప్రకాశంలో దంపతుల ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో భార్య భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని కొండెపి మండలం కట్టవారి పాలెంలో ఆదివారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. జిల్లాకు చెందిన సతీష్, ప్రసన్న దంపతులకు అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో సతీష్‌కు పనిలేక, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలోనే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయాయి. దీంతో బతుకు భారమై దంపతులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also…

45 రోజులకే భార్య వద్దంటూ భర్త సూసైడ్

Next Story

Most Viewed