దంపతుల ఆత్మహత్యాయత్నం..

by  |
దంపతుల ఆత్మహత్యాయత్నం..
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. లోతువాగు ప్రాజెక్టులోకి దూకి దంపతులు ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే యత్నం చేశారు. అప్పటికే భర్త మృతి చెందగా, భార్యను ప్రాణాలతో కాపాడారు. వీరు అశ్వారావు పేట మండలం, వినాయకపురం వాసులుగా గుర్తించారు.

అయితే, భార్యభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed