ప్రైవేటు బస్సు ఢీ కొని… భార్యాభర్తలు మృతి

by  |
ప్రైవేటు బస్సు ఢీ కొని… భార్యాభర్తలు మృతి
X

దిశ, రాజేంద్రనగర్: ప్రైవేటు బస్సు ఢీ కొని భార్యాభర్తలు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు చేస్తున్న భార్యభర్తలను ఢీ కొట్టింది.

దీంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు షాద్‌నగర్ పట్టణానికి చెందిన శాంతమ్మ(32), శేఖరయ్యలు(40)లుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి, కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed