- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవాపురం గ్రామ ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయ తాళాలు పగులగొట్టిన దుండగులు హుండీలో బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన సూపర్ వైజర్ ముత్యాల కిరణ్ చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన ఆలయానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీలోని తులం బంగారం, రూ.5000 నగదు దొంగిలించినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ సహాయంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని దుగ్గొండి ఎస్ఐ నవీన్ తెలిపారు.
Next Story