నోరూరించే చేపల వేపుడు రెసిపీ

by  |
నోరూరించే చేపల వేపుడు రెసిపీ
X

కావాల్సిన పదార్థాలు:

చేప ముక్కలు -అరకేజీ
పసుపు -పావు టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
కారం -2 టీ స్పూన్స్
ధనియాల పొడి – అర టీస్పూన్
గరం మసాలా -అర టీస్పూన్
జీలకర్ర పొడి -అర టీస్పూన్
నిమ్మకాయ రసం -2 టీస్పూన్
మొక్కజొన్న పిండి -అర టేబుల్ స్పూన్
ఉప్పు -రుచికి తగినంత
నూనె -వేయించుకోవడానికి సరిపడా
కొత్తిమీర -1 కట్ట
కరివేపాకు -రెండు రెమ్మలు

తయారు చేసే విధానం:

ముందుగా చేప ముక్కలను శుభ్ర!గా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టాలి. చేప ముక్కల్లో పసుపు, నిమ్మకాయ కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని సన్నని మంటలపై గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడు రెడీ..


Next Story

Most Viewed