- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతోంది. వేల సంఖ్యలో కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది శ్రమిస్తుంటే.. అక్కడక్కడా కొందరు వృత్తికి చెడ్డపేరు తెచ్చేలా చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ధులేలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి జేబులోని డబ్బు, నగలు ఆసుపత్రి సిబ్బంది దొంగిలించారు. అనంతరం డబ్బు, నగలు పోయిన విషయాన్ని ఆ వ్యక్తి బంధువులు గుర్తించి ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. సీసీ టీవీ కెమేరా ఫుటేజి పరిశీలించిన అనంతరం అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత కుటుంబీకులే కాకుండా నెటిజన్లు ఆసుపత్రి సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.