టీఎన్జీవో నేత మారం జగదీశ్వర్‌కు ఆత్మీయ సన్మానం

by  |
టీఎన్జీవో నేత మారం జగదీశ్వర్‌కు  ఆత్మీయ సన్మానం
X

దిశ, కరీంనగర్ సిటీ : తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ను ఆ సంఘం జిల్లా శాఖ ఘనంగా సన్మానించింది. తాను విధులు నిర్వహించే నీటి పారుదల శాఖ విభాగంలో ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సోమవారం టీ ఎన్జీవోల సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆత్మీయ సన్మానం చేశారు. అలాగే, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల శాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు‌గా ఎన్నికైన గంగారపు రమేష్ , బాస పవన్ కుమార్‌లను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, లక్ష్మి నర్సింహా రావు, నర్సింహా స్వామి, గూడ ప్రభాకర్రెడ్డి, కోశాధికారి కిరణ్ రెడ్డి, విష్ణు, ప్రసాద్, శైలజ, అశోక్, లక్ష్మారెడ్డి, అక్బర్, హర్మిన్దర్ సింగ్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story