కరోనాతో హోంగార్డు మృతి

by  |
కరోనాతో హోంగార్డు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజూ ప్రజలు దాని కోరలకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. పోలీసులపై పంజా విసురుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు బాలాజీ కరోనాతో మృతిచెందాడు.

అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకున్నాడు. ఆ టెస్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలాజీ మృతిచెందాడు. ప్రస్తుతం బాలాజీ జిల్లా హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. బాలాజీ మృతిపట్ల పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed