విద్యుత్ కార్యాలయానికి తాళం.. అధికారులు అలా చేస్తున్నారనట..! 

by  |
electrical office
X

దిశ,బోథ్ : యజమానికి కోపం వస్తె ఎలా ఉంటుందో చేసి చూపించాడు ఓ ఇంటి ఓనర్. నెలల తరబడి అద్దె కట్టకుండా వాయిదా వేస్తున్న అధికారులను బయటకు నెట్టి కార్యాలయానికి తాళం వేశాడు. బోథ్ మండలం పట్నపూర్ గ్రామానికి చెందిన ఆఫ్క వెంకటేష్ తన ఇంటిని విద్యుత్తు కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. ప్రభుత్వ కార్యాలయం కాబట్టి అద్దె సమయంలో అగ్రrమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ గత సంవత్సరం మార్చి నెలతో ముగిసింది. అయినా మళ్లీ అధికారులు అగ్రిమెంట్ చేసుకోలేదు. పైగా 15 నెలల నుండి అద్దె కూడా కట్టడం లేదు.

ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకోకుండా దాట వేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన వెంకటేష్.. మంగళవారం విద్యుత్ కార్యాలయంలో బిల్లులు వసూలు చేస్తున్న సిబ్బందిని బయటకు పంపి తాళం వేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకుని, పెండింగ్ అద్దె చెల్లిస్తేనే తాళం తీస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. కాగా, విద్యుత్ సిబ్బందిని బయటకు పంపించడంతో కరెంట్ బిల్లులను వారు బయటే వసూలు చేసుకున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Next Story

Most Viewed