హోండా నుంచి మిడ్-సైజ్ ప్రీమియం బైక్ విడుదల!

by  |
Honda Motorcycle
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన సరికొత్త ప్రీమియం బైక్ సీబీ500 ఎక్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 6.87 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీకి చెందిన బిగ్‌వింగ్ టాప్‌లైన్, డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్ మోడళ్లను విక్రయించనున్నట్టు, బుకింగ్స్ కూడా ప్రారంభించినట్టు తెలిపింది. ‘దేశీయ వాహనదారులకు సరికొత్త ప్రీమియం అనుభూతిని సీబీ500 ఎక్స్ బైక్ అందిస్తుంది. ప్రీమియం విభాగంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాము. దేశీయ రోడ్లకు, హైవే, కంట్రీ ట్రాక్ ఏదైనా కొత్త రైడింగ్ ఫీల్‌ని ఈ బైక్ ఇస్తుందని’ హోండా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈఓ అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో తెలిపారు. సిక్స్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో 471 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్ లభిస్తుందని, మిడ్-సైజ్ ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తుందని హోండా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్విందర్ సింగ్ వెల్లడించారు.



Next Story

Most Viewed