డెన్మార్క్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం

by  |
డెన్మార్క్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు జంట నగరాలకు తాగునీరందించిన హుస్సేన్​‌సాగర్​‌ను అదే స్థాయిలోకి తీసుకువచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్న హెచ్ఎండీఏ.. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి వ్యర్థాలు జలాశయంలోకి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఈ రంగంలో అనుభవం ఉన్న డెన్మార్క్​ కంపెనీ ‘డెస్మి’తో అవగాహన ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 9నెలల పాటు పైలెట్​ ప్రాజెక్టు నిర్వహణకు డెస్మి అంగీకారం తెలిపింది. వచ్చే 2నెలల్లో ‘పైలెట్​ ప్రాజెక్టు’ కార్య రూపంలోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్​ వైపు నుంచి వచ్చే పికెట్​ డ్రైన్​(నాలా) కిమ్స్​ హాస్పిటల్​ సమీపంలో హుస్సేస్​‌సాగర్​ జలాశయంలోకి ప్రవేశించే ప్రదేశంలో ఈ ‘పెలెట్​ ప్రాజెక్టు’ ను అమలుచేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందు కోసం త్వరలో డెస్మి కంపెనీ ప్రతినిధులు, వరల్డ్​ రిసోర్సెస్​ ఇనిస్టిట్యూట్​ ఇండియా ప్రతినిధులు, హెచ్​ఎండీఏ ఉన్నతాధికారులు హుస్సేస్​‌సాగర్​‌లోకి నీటిని తీసుకొచ్చే నాలాలను జాయింట్​ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. డెస్మి కంపెనీ రూపొందించిన ‘బూమ్​ బారియర్​ అండ్​ అటోమేటెడ్​ రైసర్​సిస్టెమ్​’ ద్వారా వచ్చే నీటి వ్యర్థాలను ఎంట్రీ పాయింట్​ వద్దనే ఎప్పటికప్పుడు ఏరివేసి కేవలం నీటిని మాత్రమే హుస్సేన్​‌సాగర్​ జలాశయంలోకి ప్రవేశించేలా ఈ యంత్రం పనిచేస్తుందని అధికారులు వివరించారు.

Next Story

Most Viewed