నివురుగప్పిన నిప్పులా మారిన బలిజేపల్లి

by  |
నివురుగప్పిన నిప్పులా మారిన బలిజేపల్లి
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సుబ్బయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు. ఈ క్రమంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏక్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రికత్తలు తగ్గించేందుకు ప్రత్యర్థి వర్గంలోని 40 కుటుంబాలు గ్రామం విడిచి వెళ్ళిపోయాయి. మరికొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఊరు నివురుగప్పిన నిప్పులా ఉందని, ఏ చిన్న సంఘటన చోటుచేసుకున్నా.. తీవ్ర పరిణామాలుంటాయని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

Next Story