ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం

by  |
ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం
X

హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సమావేశం జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నగరంలో వైరస్‌ను అదుపు చేయడానికి అనుసరించవలసిన వ్యూహం, కంటైన్మెంట్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ పొడిగింపు తదితర అంశాలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీపీలు అంజనీ కుమార్, మహేశ్ భగవత్ పాల్గొన్నారు.

Tags: High level meeting, pragathi bavan, ktr, etela, hyd

Next Story

Most Viewed