AP News: జగన్ సర్కార్‌కు షాక్.. ఆ జీవోపై హైకోర్టు స్టే

by  |
AP News: జగన్ సర్కార్‌కు షాక్.. ఆ జీవోపై హైకోర్టు స్టే
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతికి భూములిచ్చిన రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా భూముల లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వం భూసమీకరణ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవోపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజధానికి భూముల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 41ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం 316 జీవోను విడుదల చేసింది. ఈ జీవోపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు సోమవారం ఈ పిటిషన్‌పై విచారించింది. గతంలో అమల్లో ఉన్న జీవో ఆధారంగానే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం కూడా గుర్తించిందని.. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ స్థలాలు, పొలాలుల తమవి కావని రద్దు చేయడం అంటే అన్యాయం చేయడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పలువురు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed