తెలంగాణలో ఆ టెస్టులు పెంచాలన్న హైకోర్టు

by  |
తెలంగాణలో ఆ టెస్టులు పెంచాలన్న హైకోర్టు
X

దిశ, వెబ్‎డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వైన్ షాపులు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదో చెప్పాలని, ఆర్టీపిసిఆర్ టెస్టులు తక్కువ చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపిసిఆర్ పరీక్షలు నెమ్మదిగా పెంచుతామని ఏజీ కోర్టుకు వివరించారు. సెకండ్ వేవ్ ఉంటె టెస్టులు నెమ్మదిగా పెంచడమేంటని కోర్టు ప్రశ్నించింది. టెస్టులు, కేసులు, నిబంధనలు పాటించనివారిపై ఫైన్ల వివరాలతో 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.



Next Story

Most Viewed