వైసీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

by  |
MLA Bolla Brahmanayudu
X

దిశ, ఏపీ బ్యూరో: ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే వినుకొండ మున్సిపల్ కమిషనర్‌కు కోర్టు దిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది. సురేష్ మహల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపు నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు నోటీసులు లేకుండా అర్దాంతరంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.


Next Story

Most Viewed